Nara Lokesh: మెరుగైన ఐటీ పాలసీతో ప్రఖ్యాత ఐటీ కంపెనీలను రాష్ట్రనికి రప్పిస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. లోకేష్ మాట్లాడుతూ… ఐటీ రంగంలో ఇప్పటికే అభివృద్ధి సాధించిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లల్లో అమలు చేస్తున్న పాలసీలను అధ్యయనం చేసి మెరుగైన ఐటి పాలసీని తీసుకువస్తామన్నారు.
రాష్ట్రంలో అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలు కీలకపాత్ర పోషించబోతున్నాయన్నారు. దేశంలో టాప్ -10 ఐటి కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, త్వరలో రాష్ట ప్రజానీకం ఐటి పరిశ్రమ పెట్టుబడులపై శుభవార్త వింటారని తెలిపారు. ఐఎస్బి తరహాలో విశాఖలో ప్రపంచస్థాయి ఎఐ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామన్నారు. ఎఐ హబ్ గా కూడా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు.
’’రోబోటిక్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాలతో అనుసంధానించి ఐటిని వేగవంతంగా అభివృద్ధిచేస్తాం. రాబోయే అయిదేళ్లలో విశాఖపట్నాన్ని 100 బిలియన్ డాలర్ల ఎకానమీ నగరంగా తీర్చిదిద్దుతాం. ఐటి రంగంలో హైదరాబాద్ ను చంద్రబాబు నాయుడు గారు ఏవిధంగా అభివృద్ధి చేశారో ఐటి పరిశ్రమదారులకు తెలుసు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడి ఐఎస్ బిని హైజాక్ చేసి హైదరాబాద్ కు రప్పించారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4.0 వెర్షన్ ను చూడబోతున్నాం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని నెం.1గా నిలిపిన బాబు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీయించబోతున్నారు. చంద్రబాబు గారిలో 1995 నాటి సిఎం మాదిరిగా పనిచేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం, విశాఖను ఐటి క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అభివృద్ధి – సంక్షేమం రెండు కళ్లలా భావిస్తూ ముందుకు సాగుతోంది.
గత అయిదేళ్లలో పరిశ్రమదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ముఖ్యమంత్రి విశాఖలో తన కోసం విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు కానీ ఒక్క చదరపు అడుగు కూడా ఐటి స్పేస్ అభివృద్ధి చేయలేదు. ఐటి పరిశ్రమలకు వెళ్లే రహదారుల్లో వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. మెరుగైన ఐటి పాలసీ రూపకల్పనకు పరిశ్రమ పెద్దలతో చర్చిస్తున్నాం, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిని ఇన్సెంటివ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తాం.
ప్రస్తుతం పనిచేస్తున్న ఐటి కంపెనీలు, కొత్తగా ఏర్పాటుచేసే కంపెనీలకు ఇకపై గ్రీన్ చానల్ ద్వారా ఇన్సెంటివ్స్ అందజేస్తాం. రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటి పరిశ్రమల్లో 90శాతం విశాఖపట్నానికే రాబోతున్నాయి. విశాఖలో ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్ ను అభివృద్ధి చేస్తాం. కేవలం ఐటిలో మాత్రమే కాకుండా ఫార్మా, ఎంఎస్ఎంఇ వంటి రంగాల్లో కూడా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది.’’ అని లోకేష్ తెలిపారు.
ఇవీ చదవండి: Nara Lokesh: మెగా డీఎస్సీ విధి విధానాల ఫైలుపై మంత్రి లోకేష్ తొలి సంతకం
YSRCP: ఏపీలో వైసీపీకి వరుస షాకులు.. నేతల రాజీనామాల పర్వం
Irrigation: ఆఖరి ఎకరం వరకు నీరు అందిస్తాం: మంత్రి నిమ్మల
AP Cabinet: మళ్లీ పేపర్ లెస్ విధానం.. ఏపీ కేబినెట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్